-
ఊగిసలాడుతున్న రోజు… ఆక్టేవియో పాజ్, మెక్సికను కవి
తన పారదర్శకతకి తానే మురిసిపోతూ ఉండనా, మాననా అని రోజు ఊగిసలాడుతోంది. గుండ్రంగా భూమిని కప్పిన మధ్యాహ్నపుటెండవేళ మనుషులులేని సముద్రతీరంలా, ప్రశాంతంగా ప్రజలు జోగుతున్నారు. అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏదీపట్టుదొరకదు, అన్నీ సమీపంలోనే ఉన్నాయి ఏదీ చేతికందదు. కాగితం, పుస్తకం, పెన్సిలు, అద్దం పేరుకే… అవి ఏ పనీ లేక విశ్రాంతి తీసుకుంటున్నాయి. ‘లబ్ డబ్’ మంటూ నెత్తుటి భాషలో ఎప్పటిలాగే నా కణతల దగ్గర కాలం కొట్టుకుంటోంది. నిర్లిప్తంగా ఉన్న గోడమీద రకరకాల నీడలు వేసి…
-
అవ్యయము… జోసెఫ్ బ్రాడ్స్కీ, రష్యను-అమెరికను కవి

ఇది చాలా చిత్రమైన స్మృతి కవిత. దీని శీర్షిక చాలా నచ్చింది నాకు. మనిషి ఏమిటి మిగిల్చిపోతాడు? లేదా, మనిషి పోయిన తర్వాత ఏమిటి మిగులుతుంది? మనిషి భవిష్యత్తు అదే! వాడి గురించి చనిపోయిన తర్వాత అందరూ ఏమిటి మాటాడుకుంటారో, అంతే మిగిల్చిపోతాడు.వాడి గురించి ఎన్ని మాటాడుకున్నా, ఎన్ని గొప్ప గొప్ప పదాలు వాడినా, ఆ మాటలన్నిటిలోంచి అతిశయోక్తులు కాలక్రమంలో కారిపోతాయి. ఆ మాటలపరదాల వెనుక లేదా మృత్యు పరదా వెనుక ఎంతగొప్పవారున్నా ఒక్కటే. అతను ఎంతకాలం…
-
మరపు… చెస్లావ్ మిహోష్, పోలిష్ అమెరికను కవి

నువ్వు ఇతరులకి కలిగించిన బాధను మరిచిపో ఇతరులు నీకు కలిగించిన బాధనుకూడా మరిచిపో సెలయేళ్ళూ, నదులూ ప్రవహిస్తూనే ఉంటాయి వాటితుంపరలమెరుపులు మెరిసిమాయమౌతాయి నువ్వు నడుస్తున్న నేల నువ్వు మరిచిపోతావు. ఒకోసారి ఏ దూరతీరాన్నుండో పాట ఒకటి వినిపిస్తుంది దానర్థం ఏమిటి, ఎవరుపాడుతున్నారు? అని నిన్నునువ్వు ప్రశ్నించుకుంటావు. బాలభానుడు, మధ్యాహ్నమయేసరికి నిప్పులుకురుస్తుంటాడు నీకు మనవలూ మునిమనవలూకూడా పుడతారు. మళ్ళీ నిన్ను చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు నడిపిస్తారు. నదులపేర్లు నీకు గుర్తుండిపోతాయి. ఎంత నిరంతరాయంగా పారుతున్నట్టు కనిపించేవని! నీ భూములుమాత్రం…
-
నీవు లేక… హెర్మన్ హెస్, జర్మను కవి

సమాధి ఫలకంలా శూన్యంగా చూస్తుంటుంది తలగడ రాత్రివేళ నా వైపు నీ కురులలో తలవాల్చి నిద్రించకుండా ఇలా ఒంటరిగా పడుకోవడం ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు. ఏ చప్పుడూ లేని ఇంటిలో నేను ఒంటరిని వేలాడుతున్న లాంతరు మసిబారిపోయింది. నీ చేతులు నా చేతిలొకి తీసుకుందికి మెల్లగా చెయిజాచుతాను , కాంక్షాభరితమైన నా పెదవిని నీవైపు జాచి నన్ను నేనే ముద్దుపెట్టుకుంటాను, నిరాశతో, నిస్సత్తువతో చటుక్కున మేలుకుంటాను నా చుట్టూ చలికప్పినచీకటి నిలకడగా ఆవహించి ఉంటుంది. కిటికీలోంచి…
-
నల్లపిల్ల మరణం… కౌంటీ కలెన్, అమెరికను కవి

ఆమె గుండెలమీద రెండు తెల్ల గులాబులతో తలదగ్గరా, కాళ్ళదగ్గరా రెండు తెల్ల కొవ్వొత్తులతో నల్ల ‘మెడోనా’ లా ఆమె సమాధిలో పరుంది. పెళ్ళికొడుకు మృత్యువుకి ఆమె పట్ల ప్రేమ. తల్లి ఆమెని పెళ్ళికూతురులా అలంకరించడానికి ఆమె ప్రధానపుటుంగరాన్ని తాకట్టు పెట్టింది; ఈ రాత్రి తనను తాను చూసుకుని పెళ్ళికూతురు గర్వంగా నృత్యం చేస్తూ ఆడుతూ పాడుతుంది. . కౌంటీ కలెన్ (30 May 1903 – 9 January 1946) అమెరికను కవి . . A…
-
దేముడి పక్షపాతం … అర్నా బాంటెమ్, అమెరికను కవి

బంగరుదేహచాయగలవారికి దేముడు వయసులో ఉన్నప్పుడు అన్నీ అనుగ్రహిస్తాడు ఎంతో ఆసక్తితో, వెదుకాడే కళ్ళకు అనతికాలంలోనే కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ వారి కలలన్నీ పండేలా చూస్తాడు. నీలికళ్ళ వారికి పెద్దపెద్ద భవంతులూ అందులో అన్నిదిక్కులా తిరిగే కుర్చీలూ, ఎన్నోసార్లు నేలమీదా, ఓడల్లోనూ ప్రయాణాలూ, కాపలాకి అంగరక్షకుల్నీ, రక్షకభటుల్నీ అనుగ్రహిస్తాడు. దేముడికి నల్లవాడిగురించి అంత శ్రమపడ నవసరం లేదు అతని కన్నీటిపాత్రని తరచు నింపుతూ ప్రోత్సాహకంగా అప్పుడప్పుడు ఒక చిరునవ్వు అనుగ్రహిస్తే చాలు. దేముడు చిన్నవాళ్ళని వారి మనోకామనల…
-
అప్పచెల్లెళ్ళు… ల్యూసియో క్లిఫ్టన్, అమెరికను కవయిత్రి

నువ్వూ నేనూ అప్పచెల్లెళ్ళం ఇద్దరం ఒక్కలా ఉంటాం. నువ్వూ నేనూ ఇద్దరం ఒకతల్లి బిడ్డలం. నువ్వూ నేనూ ఒకరితప్పులు మరొకరు సరిదిద్దుతూ ఒకరికొకరు సహకరించుకుంటాం. నీకూ నాకూ పోకిరీవాళ్ళన్నా మాదకద్రవ్యాలన్నా గొప్ప భయం. నువ్వూ నేనూ ఒకసారి పర్డీ స్ట్రీట్ నుండి తుళ్ళుతూ తేలుతూ వచ్చినప్పుడు నిన్నూ నన్నూ చూసి అమ్మ నవ్వుతూనే తలతాటిస్తూ మందలించింది. నువ్వూ నేనూ ఇద్దరం పిల్లల్ని కన్నాం ఇద్దరికీ ముప్ఫై ఐదేళ్ళు పైబడ్డాయి కొంచెం నల్లబడ్డాం మన జుత్తు కూడా పలచబడింది…
-
A Teasing Phrase… Yakoob, Telugu Poet, India

Once a beautiful idea molds itself into a phrase, And if you do not appropriate it instantly, You are done. It suddenly disappears into ether! However much you long for it, you can’t recall. Search wherever you like, you can rarely find it. And even in that rare unlikely chance event, Like a depetalled rose,…
-
తెల్లవారుఝాము వచ్చిన కల … లీ చింగ్ చావో, చీనీ కవయిత్రి

ఈ కవితలో చాలా కుతూహలమైన విషయాలున్నాయి : తెల్లవారుఝామున వచ్చిన కల నిజమౌతుందన్న నమ్మకం, అక్కడి ప్రజల్లో కూడా ఉండేదన్నమాట. దాన్ని మూఢనమ్మకంగా గుర్తించిన మేధావి వర్గం కూడా ఉండేదన్నమాట. మనసులో చాలా గాఢంగా ఉన్న కోరికలే కలలరూపంలో వస్తాయని ప్రతీతి. ఇష్టమైన కలలు వచ్చినపుడు ఆ కలలలోంచి బయటపడడానికి మనసు ఇష్టపడదు. అందుకే ఆ సమయంలో ఎవరైనా మేలుకొలపబోతే విసుక్కుంటాం. లేవవలసిన అవసరం వస్తే అయిష్టంగా బయటపడతాం.ఆ కలనే పదే పదే నెమరువేసుకుంటాం. మేధావులు మేధావులతో…
