నిరాశా గీతం – part 2 Neruda

ఓ శిధిలావశేషాల రాశీ! అన్నీ నీలోలయించాయి.
నువ్వు ప్రకటించని విషాదం ఏది, నువ్వు మునక వెయ్యని విషాదం ఏది!

ఓడముందు నిలబడి,  నావికునిలా
ఉత్తుంగ తరంగాలపైనుండి నువ్వు పిలుస్తూ ఆలపిస్తున్నావు.

నువ్వు గీతాల్లో ఇంకా వికసిస్తూనే ఉన్నావు, కెరటాల్ని అదుముతూనే ఉన్నావు,
ఓ శిధిలావశేషాల రాశీ! నువ్వొక గట్టులేని క్షారజల కూపానివి.

పాలిపోయిన శీఘ్ర చోదకుడూ, అదృష్టంలేని వడిశల వేటగాడూ,
దారితప్పిన శోధకుడూ, అందరూ నీలో లయించారు.

ఇది ఇక నిష్క్రమించవలసిన సమయం, రాత్రి ప్రతి ఝాముకీ
నిర్దేశించినట్టు, ఇప్పుడు చలి వణికించే వేళ.

ఘోషిస్తున్న కెరటాలు ఒడ్డును చుట్టుముడుతున్నాయి.
మంచుముక్కల్లా తారలు మీదకు లేస్తున్నాయి, నల్లని నీటికొంగలు వలసపోతున్నాయి.

తెల్లవారుఝామున ఓడరేవులా చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది.
వణుకుతున్న నీడలు నా చేతిలో వంకరలుపోతున్నాయి.

ఓహ్. అన్నిటికీ దూరంగా, అన్నిటికీ దూరంగా.
ఇది నిష్క్రమించవలసిన సమయం. ఓ నా వర్జితా!

—-Pablo Neruda

“నిరాశా గీతం – part 2 Neruda” కి 2 స్పందనలు

  1. ఎంత గాఢతను మూటగట్టుకున్నాయి ఈ పదాలు.. మీ అనువాదానికి ధన్యవాదాలండీ..

    మెచ్చుకోండి

Leave a reply to saamaanyudu స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.