శ్వాసించలేనివీ, వేటినీ చూడలేనివీ
అలాంటి వాటికే ఎందుకు మరణం ఉండదో?
ఒక పిసరంత నేలకీ, స్పందనలేని రాతికీ,
ఒక ధూళి కణానికీ, కేవలం మట్టిపెల్లకీ
శాశ్వతత్వం అనుగ్రహించబడింది.
ఒక రైలుదారి పక్క గులకరాయికి మృతిలేదు…
భగవంతుని అపురూపవరం లభించింది దానికి.
మన పూర్వీకులు కోసిన గడ్డి
ఇపుడు వాళ్ళ సమాధులపై మొలుస్తోంది.
పారీ పారనట్టి అతి చిన్న వాగులు
ఎప్పుడూ ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయి.
ఇసకలా జడమై బలహీనమైనవాటిని
చంపి ప్రాణంతీయగల మృత్యువు లేదు.
మనిషొక్కడే గొప్పవాడూ, బలవంతుడూ
మేధోపజీవీ…. అందుకే అతనికి మరణం.
.
వ్యాఖ్యానించండి