చీకటి పడింది, ఇపుడు ప్రకృతిదృశ్యం రమణీయంగా లేదు;
నేను విచారిస్తున్నాను, కానీ, ఓ వనసీమలారా మీకోసం కాదు;
ఎందుకంటే పొద్దు పొడుస్తూనే మీ అందాలు మీకు తిరిగి వస్తాయి,
సరికొత్త సువాసనలు అద్దుకుంటూ, మంచుతో మెరుస్తూ:
నేను శీతకాలపు విధ్వంశానికీ వగవను;
దయాళువైన ప్రకృతి కుసుమాంకురాల్ని పదిలపరుస్తుంది,
చివికిపోతున్న ఈ అస్థికలశం మీద ఎప్పుడు వసంతం కరుణిస్తుంది!
నిశీధిలో చిక్కుకున్న ఈ సమాధిపై పొద్దుపొడిచేదెపుడు?
.
జేమ్స్ బీటీ,
(25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు 1803)
స్కాటిష్ కవీ, తత్త్వవేత్త.
![]()
వ్యాఖ్యానించండి