చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు

చర్చిగంటలు మ్రోగడం లేదు.
శవయాత్ర సాగుతోంది… అయితే
కొందరు ఇరుగు పొరుగు వాళ్ళూ,
అతని ప్రచురణ కర్తలు కనపడటం లేదు
శ్మశానంలో పాడె క్రిందకి దింపారు
కాని, కాల్చడానికి కట్టెలూ,
కొన్ని నిముషాలు దొర్లిపోయాయి
ఆరె! ఎవరది ఓ డొక్కు రిక్షాలోంచి
అతని వితంతువు అతని వ్రాతప్రతులన్నీ
ఇక మనం చితిముట్టిద్దాం రండి
His publishers are unseen
“చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు” కి 6 స్పందనలు
-
మన దేశంలో కవి స్థానం గురించి ఈ వేదన మనసు కదిలించేలా ఉంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అవును జ్యోతిర్మయీ,
ఈ దేశంలో పరమ నికృష్ట రాజకీయనాయకులకున్న విలువ కూడా కవులకీ కళాకారులకీ లేదు. గుర్తింపు ప్రతిభనిబట్టిగాక అధికార గణానికి చూపించగల విశ్వాసం మీద ఉంటుంది చాలా సందర్భాలలో.
ఆశీస్సులతో,మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
మనదేకాదు, ప్రపంచం మొత్తంమీద కవులకు యిదే దుస్థితి వుందేమో!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శర్మగారూ,
ఈ విషయం లో నేను మీతో ఏకీభవించ లేను. చాలా దేశాల్లో, మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో, కవులకీ కళాకారులకీ వ్యక్తిగతంగానూ, వారి రచనలపట్లా కూడా అమితమైన శ్రధ్ధాభక్తులున్నాయి. వారి రచనలు ఇష్టం వచ్చినట్లు మార్చేసో, లేదా స్వంతకల్పన జోడించో చెప్పరు. (పేరడీలు వేరే సంగతి. అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి.). ఛాసరునాటి కవుల సమాధుల దగ్గరనుండి, వాళ్ళు చిన్నప్పుడు నివసించిన ఇళ్ళుకూడా జాతివారసత్వాలుగా పరిగణించి పదిలపరచుకోవడం చూస్తున్నాం. మనదేశంలో అటువంటి సంస్కారం లేదు. ఎక్కడలేని విగ్రహాలూ దేశాన్నిదోచుకున్న”అకళంక దేశభక్తులకే” చాలటం లేదు. కవులకీ కళాకారులకీ ఎక్కడవస్తాయి. పొరపాటున ఎవరైనా పెడితే వాటిని మనం నిలుపుకోలేము కూడా. ఆంధ్రదేశానికివస్తే, పరిస్థితి ఇంకా దారుణం. గురజాడగురించి అంత గర్వంగా చెప్పుకుంటాం. అతని నాటకాన్ని రంగస్థలిమీద చూపించేటప్పుడు ప్రతి తలమాసిన డైరెక్టరూ వాడి పైత్యాన్నిబట్టి మార్చిపారేస్తుంటాడు. వెలుగు రామినాయుడు లాంటివాళ్ళు పూనుకోకుంటే ఆపాటి గురజాడవారి ఇల్లూ కూడా ఏ అక్రమసంపాదనాపరుడో కొనేసి అపార్ట్ మెంట్లుచేసి అమ్మేసి ఉండే వాడు. ఇప్పుడు శ్రీశ్రీ పుట్టిన ఇల్లు విశాఖపట్నం మహరాణీపేటలో ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా? మనకి మన చరిత్రపట్ల ఉన్న నీరసభావం మన చేతల్లో కనిపిస్తుంది. పోతన లాంటి ఏ మహానుభావుడికో చెల్లుతుంది తప్ప, కవులు ఇప్పుడు కవిత్వాన్ని నమ్ముకునీ బ్రతకలేరు, అమ్ముకునీ బ్రతకలేరు. ముందుగా కవిత్వసంకలనాలు ప్రచురణకర్తలు అచ్చెయ్యరు… కవులు వాళ్ళంతటవాళ్ళు వేస్తే కొని చదివే నాధుడుండడు. కనుక, కవులలోన తెలుగు కవులన్న వేరయా అనుకోవలసిందే.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
మీ నుంచి యింత జవాబు ఆశించాను. సాధించాను. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి ఇంటిని పదిలపరచలేకపోయారు. అలాగే మరో అస్థాన విద్వాంసుడే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారిల్లు కూడా నిలపలేకపోయిన ప్రభుత్వాలు మనకున్నాయి. దౌర్భాగ్యం.మొన్న నొక పత్రిక లో చూశాను పంప మహా కవి సమాధి వున్న శిలా శాసనం గాలిలో దొర్లుతోంది.నేడో రేపో అది చాకలి బండగా మారినా అశ్చర్యపోనక్కరలేదు. అటు కర్నాట,ఆంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు.విశేషం యేమంటే పంపడు తెలుగు వాడు. కన్నడలో మొదటి భారత రచన చేశాడు. నాకు బాగా అవేశం వచ్చేసిందనుకుంటా.నిరాశతోనే ఆ మాటాన్నా. క్షమించండి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శర్మ గారూ,
ఇవాళ అకస్మాత్తుగా మనకి కొన్నివేల ఏళ్ళనాటి నిధిగాని పొరపాటున బయటపడిందా, ముందు అందులోని బంగారం వెండీ వగైరా ఏవైనా ఉంటే వాటిని కరిగించేసి సొమ్ముచేసుకుందికి చూస్తారు తప్ప, అయ్యో ఎటువంటి అపూర్వమైన సమాచారం దాగుందో, దానివలన ఎన్ని చిక్కుముడులు విడుతాయో అని ఆలోచించగల మనస్తత్త్వం, సంస్కారం మన చదువులు ఇవ్వలేకపోతున్నాయి. ఫేషన్లు ప్రజలనుండి పాలకులకీ, నీతి నియమాలు పాలకులనుండి ప్రజలకీ చేరుతాయని లోక వ్యవహారం.
అభివాదములు.మెచ్చుకోండిమెచ్చుకోండి
స్పందించండి